కొత్తకోట: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో శంకర సముద్రం రిజర్వాయర్లో మంత్రులతో కలసి ఎమ్మల్యే ఆల వెంకటే శ్వర్ రెడ్డి చేపలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపరి పోసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. మొదట్లో 22 కోట్లతో మొదలై ఇప్పుడు 93 కోట్లు చేరుకుందన్నారు. అదనంగా 22 కోట్లతో రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపదకు నిలయంగా మారిందన్నారు. సమాఖ్య పాలనలో మత్స్యకారులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్య సంపద పెరిగిందని, ఇతర రాష్ర్టాలకు కూడాఎగుమతి చేస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమై ఆహారం అందించే వారు మత్స్యకారులని వారి కోసం సబ్సిడీ కింద వాహనాలు, వలల ను, ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు.
అంతకుముందు రిజర్వాయర్లో 1.25లక్షల రొయ్యలు, 4.80 లక్షల చేపలు వదిలారు. కానాయపల్లి నిర్వాసితులకు న్యాయం చేస్తామని వారి సమస్యలను పరిష్కంచేందుకు ముఖ్యమంత్రి దృషికి తీసుకెళ్తా మని, అసెంబ్లీలో చర్చించి పరిష్కస్తామని వారు తెలిపారు.
అంతకుముందు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో కోటి చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల అండదండలు కేసీఆర్కు ఉం డాలన్నారు. కానాయపల్లి పునరాస సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. నిర్వా సితులను రోడ్డున పడేసే గుణం సీఎం కేసీఆర్ స్వభావం కాదన్నారు.
ఎల్వోసీ అందజేత
అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న కొత్తకోట పట్టణానికి చెందిన శేఖర్గౌడ్ వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్వోసీని మండల పరిధిలోని కానాయపల్లి గ్రామంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డిలు బాధిత కుటుంబానికి మంగళ వారం అందజేశారు.
కార్యక్రమంలో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ లచ్చిరాంనాయక్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్ రెడ్డి, మాజీ డీసీసీబీ డైరక్టర్ రావులు సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లా ల ఆధికారి ప్రతినిధి ప్రశాంత్, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు రంగస్వామి, మండల రైతు సంఘం అధ్యక్షుడు కొండారెడ్డి, నాయకులు బాలకృష్ణ, శ్రీనుజీ, జగన్మో హన్ రెడ్డి, వినోద్సాగర్, హన్మంత్, శంకర్ యాదవ్, సుభాశ్, వాసీంఖాన్, శ్రీనివాసులు, డీసీ. రాములు, నాగరాజు, కృష్ణయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.