వనపర్తి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోట మండలం విలియంకొండ వద్ద ఓ మామిడిపండ్ల లారీ టైరు పగిలి బోల్తాపడింది. అనంతరం లారీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీలో మంటలు ఆర్పివేశారు. లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-కర్నూల్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.