వనపర్తి: బయోటెక్ విద్యాసంస్థల అధినేత డీకే విశ్వనాథం గుండెపోటుతో మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండలం పెద్దమారు. ప్రస్తుతం ఆయన చిన్నంబావిలో ఉన్న కేడీఆర్ స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలలో పనిచేసిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకునిగా కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి