వనపర్తి, డిసెంబర్ 30 : బంగారు తె లంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెం ట్, మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత మైస న్, వక్ఫ్బోర్డు సభ్యులు, జిల్లా మైనార్టీ నేత షేక్ జహంగీర్ ఆధ్వర్యంలో 300 మంది వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ లు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చే రారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేసి దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతు న్న సంక్షేమం, అభివృద్ధి పనులు చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీ ఆర్ఎస్లో చేరేందుకు వరుస కడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చై ర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గ ట్టుయాదవ్, కౌన్సిలర్ సమద్, నాయకు లు పరంజ్యోతి, లతీఫ్, గులాం ఖాదర్, ఖాజాఖాన్, జాతృనాయక్, చంద్రశేఖర్ నాయక్, రాము తదితరులున్నారు.