వానకాలంలో జర జాగ్రత్త
పొలాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలి
విద్యుదాఘాతంతో పలు
టోల్ఫ్రీ నెంబర్ 1912 ఏర్పాటు
వనపర్తి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో వర్షాలు, ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యా ల వల్ల కరెంట్ తీగలు తెగిపోవడం, సాగడం, స్తం భాలు విరిగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఎర్త్ విఫలం కావడం వంటివి సంభవిస్తుంటాయి. ఆ సమయంలో అజాగ్రత్తతో వ్యవహరించడంతో విద్యుదాఘాతానికి గురై చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మూగజీవాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయి. ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కావడంతో బోరుబావులు, విద్యుత్ మో టర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇనుప స్టార్ట ర్లు వాడడంతో ఎర్త్ అయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్తంభం నుంచి మోటర్లకు వైర్లు జా యింట్లు లేకుండా ఉండేలా చూసుకుంటే మేలు. వా నకాలంలో స్తంభాలను ముట్టుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్లు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోవడం వంటి ఘటనలు ఉంటే వి ద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. ట్రా న్స్ఫార్మర్ల వద్ద అనుమతి లేని వ్యక్తులు, వినియోగదారులు ఫీజులు మార్చడం, సర్వీస్ వైర్లు, వీధి దీపాలు సరిచేయడం వంటి పనుల కారణంగా కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
పంపుసెట్ల వద్ద అప్రమత్తత..
వ్యవసాయ పంపుసెట్లు వినియోగించే సమయం లో కరెంట్ మోటర్లు, ఫుట్వాల్వ్లు, ఇన్సులేషన్ సరి గా లేకపోవడంతో విద్యుత్ ప్రసారం జరుగుతుంది. ఆ సమయంలో వాటిని తాకడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. పంపుసెట్లు ఆన్ చేసే సమయం లో అ న్నీ సక్రమంగా ఉన్నా యో లేదో సరిచూసుకోవాలి. విద్యుత్ వై ర్లు తెగిపడటం, ఎర్త్ రా వడం వంటివి జరుగుతున్నా యో చూసుకోవాలి. ముఖ్యంగా వర్షం, గాలిదుమారం వచ్చినప్పుడు మోటర్లను తాకే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు..
విద్యుత్ వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇండ్లల్లో వైర్లు, కరెంట్ సరఫరా సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యుత్ పరికరా లు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మోటర్లు, ఐరన్బాక్స్, కూలర్లు, వాషింగ్ మిషన్ వాడే సమయంలో ఏదైనా విద్యుత్ వైర్ తెగితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులు, వృద్ధు లు వినియోగిస్తున్నట్లయితే వారికి అవగాహన కల్పించాలి. అలాగే ఐరన్ వైర్లపై దుస్తులు ఆరేస్తుంటారు. ఈ సమయంలో కరెంట్ వైర్లు తీగకు తగలకుండా జా గ్రత్త పడాలి. సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడొద్దు. చార్జర్లో సాంకేతిక లోపాలు తలెత్తితే విద్యుత్ ప్రసారం జరుగుతుంది. చార్జింగ్ తొలగించి మాట్లాడడం ఉత్తమం.
విద్యుదాఘాతానికి గురైతే..
విద్యుదాఘాతానికి గురైతే పక్కన ఉన్న వా రు అప్రమత్తంగా వ్యవహరించాలి. షాక్ కొట్టిన వ్యక్తిని కాపాడాలన్న తొందరలో అతడిని పట్టుకుంటే మనకూ ప్రమాదం జరుగుతుంది. విద్యుత్ ప్రసారం కాని వస్తువు, కర్ర, గ్లౌజులతో విద్యుత్ వై రు నుంచి వ్యక్తిని వేరు చేసేందుకు ప్రయత్నించాలి. షాక్ తగిలిన వ్యక్తిని గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టి వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
టోల్ఫ్రీ నెంబర్లకు కాల్ చేయండి..
విద్యుత్ ప్రమాదాలు సంభవించినా, విద్యుత్ తీగలు తెగిపోయినా, స్తంభాలు ఒరిగినా, విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్నా టోల్ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం ఇవ్వండి. అలాగే విద్యుత్ శాఖ అధికారులకూ తెలపండి. అధికారులు ఎప్పటికప్పుడు విద్యుత్ లైన్లను, స్తంభాలను పరిశీలిస్తుంటారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో వాల్పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఇండ్లల్లో ఎర్తింగ్ చేసి ఉంటే ప్రమాదాలు జరిగినా అంతగా తీవ్రత ఉండదు.