ఆత్మకూరు, జూలై 12 : ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలిచే ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాలు అరుదైన ఘనత ను సాధించాయి. ప్రాజెక్టు ప్రారంభమైన 12 ఏండ్ల నుంచి ఎన్న డూ లేని విధంగా రికార్డును నెలకొల్పాయి. కృష్ణమ్మ దీవెనలతో ఈ ఏడాది ముందస్తుగా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎగువ నుంచి వరద రూపంలో కృష్ణమ్మ ఏరువాక కంటే ముందే రావడంతో జలవిద్యుత్ కేంద్రాల్లో అరుదైన ఘనత సాధ్యమైంది. ప్రా జెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జూన్లో వరదలు వచ్చిన దాఖలాలు లేవు. ఈ ఏడాది కృష్ణమ్మ మందుగా పలకరించింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో రికార్డు విద్యుదుత్పత్తి నమోదైంది.
జూన్లోనే అరుదైన ఘనత..
జూరాల జలవిద్యుత్ కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జూన్లో విద్యుదుత్పత్తి చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి జలవిద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది అరుదైన ఘనత సాధ్యమైంది. ప్రతిసారీ జూలై, ఆగస్టులోనే వచ్చే వరద, ఈ ఏ డాది వాతావరణంలో కలిగిన మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో నెలకుపైగా ముందుగానే వచ్చింది. దీంతో వరదను వృథా చేయకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. దీంతో జూన్ మాసంలోనే దాదాపుగా 50 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
జూన్ 9 నుంచి జూలై 2 వరకు..
ఎగువ జూరాలలో జూన్ 9న, దిగువ జూరాలలో జూన్ 10న విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి జూలై 2 వరకు విద్యుదుత్పత్తి కొనసాగింది. మొ దట్లో ఒక్క యూనిట్తో నిర్వహించగా.. చివరి వర కు గరిష్ఠంగా నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేశారు. 24 రోజుల్లో రోజుకు 1.01 మిలియన్ యూనిట్ చొప్పున విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి కొనసాగించిన ఉత్పత్తితో 24 రోజుల్లో 57 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఎగువ జూరాలలో 26 మిలియన్ యూనిట్లు, దిగువ జూరాలలో 31 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టిన క్రమంలో పది రోజులుగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు.
వారబందీ ప్రకారం..
తెలంగాణ, కర్ణాటకలకు వాటా కలిగిన ఎగువ జూరా ల జలవిద్యుత్ కేంద్రంలో ఇప్పటి వరకు జరిగిన ఉత్పత్తిలో తెలంగాణకే అధిక ఉత్పత్తి సొంతమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 26.327 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిలో తెలంగాణకు 21.63 మిలియన్ యూనిట్లు, కర్ణాటకకు 4.35 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి దక్కింది. వారబందీ ప్రకారం జరిగే ఉత్పత్తిలో రాష్ర్టానికి కేటాయించిన సమయంలో అధిక వరద, ఎక్కువ యూనిట్లలో ఉత్పత్తి జరగడం విశేషం. ఇదే కారణంతో ఎగువ జూరాలలో జరిగిన విద్యుదుత్పత్తిలో ఎక్కువశాతం ఉత్పత్తి స్వరాష్ర్టానికి దక్కింది.
ముందస్తు ఊహించిందే..
నిత్యం ఎగువ నుంచి వస్తున్న సమాచారంపై నిఘా పెట్టడంతో ముందస్తు వరదను ఊహించాం. ఎగువనుంచి వచ్చే వరదను బట్టి ఎప్పటికప్పుడు విద్యుదుత్పత్తికి సిద్ధమయ్యాం. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో ముందస్తుగానే విద్యుత్ కేంద్రాల్లో సన్నాహక పరీక్షలునిర్వహించాం. వరద వచ్చే నాటికి ఊహించిన విధంగా గంటల వ్యవధిలో విద్యుదుత్పత్తి ప్రారంభించాం.ఈ ఏడాది జూన్లోనే రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం హర్షించదగ్గ విషయం. మళ్లీ వరద రాగానేతిరిగి విద్యుదుత్పత్తి కొనసాగిస్తాం. జలవిద్యుత్ ఉత్పత్తిలో రెండు ప్రాజెక్టులు ఇప్పటికే ఆల్టైమ్ రికార్డులునెలకొల్పాయి. గతేడాది ఎగువ జూరాలలో 370, దిగువ జూరాల లో 403 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాం. ఈ ఏడాది ఉన్నతాధికారులు ఎగువలో 354 ఎంయూ, దిగువలో 380 ఎంయూ లక్ష్యాన్ని విధించారు. వచ్చే వరద, జరిగే ఉత్పత్తి ఆధారంగా లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషిచేస్తాం.