ఈద్గా, మసీదుల్లో ప్రార్థనలు
ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, జూలై 21 : త్యాగ నిరతిని చాటే బక్రీద్ పండుగను బుధవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో ని ర్వహించారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంత రం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పేదలకు ఉన్నంత లో దాన ధర్మాలు చేశారు. మతపెద్దలు ‘ఖుద్బా’(ధార్మిక ప్రసంగం) నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వానగుట్ట వద్ద ఉన్న వక్ఫ్ రహెమానియా ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్య లో నమాజ్లో పాల్గొన్నారు. ఎక్సైజ్, క్రీ డా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు వానగట్టు ఈద్గా వద్దకు వెళ్లి ముస్లింలను కలిసి పం డుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేం ద్రంలోని పలు మసీదుల వద్ద ము స్లింలు నమాజ్ చేశారు. మతపెద్దలు పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
పాలమూరు జిల్లా కేంద్రంలోని వానగుట్ట వద్ద ఉన్న వక్ఫ్ రహెమానియా ఈద్గా వద్దకు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కుల, మతాలకు అతీతంగా అందరూ క లిసి మెలిసి ఉండాలని కోరారు. పేదల కు సాయం చేస్తే అల్లా అనుగ్రహం ఉం టుందన్నారు. సీఎం కేసీఆర్ హయాం లో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. మంత్రి వెంట ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకట య్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, కౌన్సిలర్లు, నాయకులు మోసీన్ఖాన్, మహ్మద్ జకీ పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతీక..
వనపర్తి టౌన్, జూలై 21 : త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకొంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం తన స్వగృహంలో బక్రీద్ సందర్భంగా ముస్లింలకు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రిని ముస్లింలు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత పెద్దలను గౌరవించుకునే పండుగ బక్రీద్ అ ని, స్థోమతను బట్టి సోదరులకు, సన్నిహితులకు మాంసం, అన్నదానం చేసే సాంప్రదాయం కొనసాగిస్తున్నారన్నారు.