సిటీబ్యూరో, జులై 9(నమస్తే తెలంగాణ): స్టేట్ డాటా సెంటర్ సాంకేతిక నిర్వహణ కార్యాచరణలో భాగంగా మూడు రోజులు ఆర్టీఏ ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉండవని ఆర్టీఏ ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు సేవలకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు వాహనదారులు గమనించాలని అధికారులు కోరారు. నేడు రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. సోమవారం ఒక్క రోజు మాత్రం వాహనదారులకు ఇబ్బంది తప్పదు. ఆ మరుసటి రోజు నుంచి సేవలు నిరంతరం అందుతాయని చెప్పారు.