చిలిపిచెడ్, జూలై 9: హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకమని, తెలంగాణ రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ స్వప్నమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. ఏడో విడుత హరితహారం, నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని అంతారం గ్రామంలో హరితహా రం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. అనంతరం అంతారం గ్రామ పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులను పరిశీలించి..గ్రామ సర్పంచ్ అశోక్గౌడ్ను అభినందించారు. గ్రామ సర్పంచ్ అశోక్గౌ డ్, ఉప సర్పంచ్ నరహరి, మండల ప్రత్యేకాధికారి దేవ య్య, ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో పోలేశ్వర్రా జు, ఎం పీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాశ్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ రామాగౌడ్, నాయకులు మాణిక్యరెడ్డి, కిషన్రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
చేగుంట, జూలై9: చేగుంట మండల పరిధిలో వల్భాపూర్ పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ సందర్శించి, మొక్కలు నాటారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ శిథిలావస్థలో ఉన్న ఇండ్లను జేసీబీ సహాయంతో తొలగించారు. చందాయిపేటలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత తన పాలకవర్గం సభ్యులతో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.
చేగుంట, జూలై 9: చేగుంట జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, ప్రత్యేకాధికారి జయరాజ్, చేగుంట నార్సింగి మండలంలోని పలు పాఠశాలలో పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు.
ప్రగతి సక్సెస్పై కృతజ్ఞతలు..
చిలిపిచెడ్, జూలై 9: పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో శశిప్రభ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రమైన చిలిపిచెడ్తోపాటు అన్నిగ్రామాల్లో 9వ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు.
చిలిపిచెడ్, జూలై 9: మండలంలోని శీలాంపల్లి గ్రామం లో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పారిశుధ్యం పనులను జడ్పీటీసీ శేషసాయిరెడ్డి పరిశీలించి.. వైకుంఠధామంలో మొక్కలు నాటారు. సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, సర్పంచ్ కవితముకుందరెడ్డి పాల్గొన్నారు.
ప్రగతిపై అవగాహన
తూప్రాన్ రూరల్, జూలై 9 : పల్లెప్రగతిలో భాగంగా ఎంపీడీవో అరుంధతి నర్సంపల్లిలో పర్యటించి పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. కోనాయిపల్లి(పీబీ) పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సర్పంచ్ పాండు పూల మొక్కలను నాటారు. గుండ్రెడ్లిపల్లిలో సర్పంచ్ శ్రీలతారాజిరెడ్డి శిథిలావస్థ ఇండ్లను కూల్చి వేయించారు.
ఎంపీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో సంతోష్రెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తూప్రాన్లో..
తూప్రాన్ రూరల్, జూలై 9: మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని 16 వార్డుల్లో పట్టణప్రగతి పనులు జోరందుకున్నాయి. ఆయా వార్డుల్లో కాలనీలు, పరిసరాలను కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్, నారాయణగుప్తా, కుమ్మరి రఘుపతి, మామిడి వెంకటేశ్, ఉమాసత్యలింగం, మామిండ్ల జ్యోతి, అరుణావెంకట్గౌడ్ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. వారి వెంట మున్సిపల్ ఆర్ఐ రమేశ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటిని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి
మనోహరాబాద్, జూలై 9 : ఇంటితోపాటు గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఐదు మొక్కలను నాటాలని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండ లం ముప్పిరెడ్డిపల్లి, వెంకటాపూర్ అగ్రహారం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శుక్రవారం పరిశీలించారు. ముప్పిరెడ్డిపల్లిలో అంగన్వాడీ భవనాన్ని, మొక్కల పెంపకం, రోడ్డువెడల్పు పనులు, వైకుంఠధామాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటాపూర్ అగ్రహారంలో చెత్తబుట్టలు, ఇంటింటికీ ఐదు మొక్కలను అందజేశారు. డంపింగ్యార్డును పరిశీలించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్రెడ్డి, ఎంపీపీ పురం నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్లు రేణుక, నరాల ప్రభావతిపెంటయ్య, గ్రామకమిటీ అధ్యక్షుడు నర్సింహులు, నాయకుడు కృష్ణాగౌడ్ పాల్గొన్నారు.