కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కోల్కతా హైకోర్టు జడ్జి కౌశిక్ చందా 5 లక్షల జరిమానా విధించారు. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కేసు నుంచి జడ్జి కౌశిక్ తప్పుకోవాలని మమతా కోరారు. దీంతో ఆ కేసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి కౌశిక్ చందా తెలిపారు. అయితే ఆ కేసును విడిచిపెట్టే ముందు ఆయన మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జికి కళంకం తెచ్చే విధంగా సీఎం మమతా బెనర్జీ ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నట్లు కౌశిక్ ఆరోపించారు. రాజ్యాంగబద్దమైన విధులను ఆమె ఉల్లంఘించినట్లు జడ్జి పేర్కొన్నారు. జస్టిస్ చందాకు బీజేపీ నేతతో లింకులు ఉన్నాయని, అందుకే తన కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని మమతా బెనర్జీ కోరారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో ఆమె ఈ అభ్యర్థన చేశారు. దీని పట్ల జడ్జి కౌశిక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.