మౌర్యాని, శుభలేఖసుధాకర్, రాజేశ్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రైతం’. రవికుమార్.ఎస్ దర్శకుడు. పసుపులేటి వెంకటరమణ నిర్మాత. ఇటీవల హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నిఖిల్ క్లాప్నివ్వగా, దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది. ‘భగవద్గీత’లోని త్రైత సిద్ధాంతం ఆధారంగా మనిషి, దేవుడితో పాటు ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్స్లో హైదరాబాద్లో పూర్తిచేస్తాం’ అని తెలిపారు. కథాబలమున్న మంచి సినిమాలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని మౌర్యాని చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్.