పాఠశాల ప్రారంభానికి సంసిద్ధులు కావాలి

- కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, జనవరి 21 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల ప్రారంభానికి సంసిద్ధులు కావాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో పాఠశాలల ప్రారంభం విషయమై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం దృష్ట్యా ఈనెల 25 నాటికి అన్ని పాఠశాలల్లో మొదటి విడుత శానిటైజేషన్ పూర్తి చేయాలని, అలాగే ప్రతి పాఠశాలలో మాస్కుల పంపిణీకి చర్య లు తీసుకోవాలని చెప్పారు. శానిటైజేషన్ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, విద్యాకమిటీ చైర్మన్గా ఉంటారని తెలిపారు. ప్రతి తరగతిలో 25 మంది విద్యార్థులు మాత్రమే ఉం డాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం 9, 10 తరగతులకు మాత్రమే హాస్టళ్లు నిర్వహించాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు డిమాండ్ చేయకూడదన్నారు. సమావేశంలో డీఈవో సుశీందర్రావు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ పాల్గొన్నారు.
పాన్గల్లో..
పాన్గల్, జనవరి 21 : విద్యార్థుల విద్యాబోధనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరలో ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంఈవో లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని 11 ఉ న్నత పాఠశాలను శుభ్రం చేయడం, సోడియం హైపోక్లోరైట్ ద్రా వణాన్ని పిచికారీ చేయించారు. మండలకేంద్రంలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ఎంపీపీ శ్రీధర్రెడ్డి పరిశీలించారు.
తాజావార్తలు
- వన్ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ