కుత్బుల్లాపూర్, జూన్15: అభివృద్ధికి బాటలు వేస్తూనే.. మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ డివిజన్ భగత్సింగ్నగర్లో రూ.9.05 లక్షల నిధులతో చేపడుతున్న శ్మశాన వాటిక ప్రహరీ, రూ.14.90 లక్షలతో భారీ వరదలకు దెబ్బతిన్న వర్షపు నీటి నాలాల పునర్నిర్మాణ పనులకు డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీతో కలిసి శంకుస్థాపన చేశారు.
అంతకు ముందు తన నివాసం వద్ద నియోజకవర్గంలోని పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఒక్కొక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి నాయీబ్రాహ్మణుల సెలూన్షాపులకు ప్రభుత్వం ఉచితంగా 250 యూనిట్ల వరకు విద్యుత్ను అందిస్తున్న సందర్భంగా నియోజకవర్గానికి చెందిన ఓం మణికంఠ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్నిఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల పార్టీల శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.