ఖమ్మం : జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రతి ఏడాది చేపలు, రొయ్యల వేట ప్రాంభించిన మత్స్యకారులు రొయ్యలను ప్యాకింగ్ ద్వారా అమెరికా, యూకే, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. రొయ్యల వేట ప్రారంభించిన 24 గంటల్లోనే పాలేరులో ప్రాథమికంగా గ్రేడింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు తరలిస్తారు. అక్కడ చెన్నైకి చెందిన రొయ్యల ఎగుమతి కంపెనీ వారు మన రొయ్యలను కొనుగోలు చేసి గ్రేడింగ్తో 100శాతం క్వాలిటీగా వాటికి తగినంత ఐస్ను ప్యాకింగ్ల ద్వారా సముద్రమార్గంతో ఇతర దేశాలకు తరలిస్తారు.
ప్యాకింగ్ చేసిన రొయ్యలు సుమారు 20 రోజుల వరకు పాడు కాకుండా ఉండేలా ఏర్పాటు చేస్తారు. పాలేరులో వాటి ధర 50 గ్రాముల కంటే తక్కువ ఉన్న రొయ్యలు కిలో ధర రూ. 130, అంతకంటే ఎక్కువ బరువు గల రొయ్యలు రూ.220 ధర నిర్ణయించారు. ఇదే రొయ్యల ధరలు ఒంగోలులో రూ.100 అదనంగా ఉంటుంది. విదేశాల్లో వాటి ధరలు పెద్ద రొయ్యలు రూ. 800, చిన్నవి రూ.600 వరకు విక్రయిస్తారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి