ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పొకో త్వరలో మొట్టమొదటి 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పొకో M3 Pro 5G స్మార్ట్ఫోన్ను ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా జూన్ 8న మధ్యాహ్నం 11.30 గంటలకు ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ను గతనెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. దేశంలో కంపెనీ విడుదల చేస్తున్న తొలి 5జీ స్మార్ట్ఫోన్ ఇదేనని పొకో ఇండియా ట్విటర్లో వెల్లడించింది. ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్ల మాదిరిగానే ఇండియా వేరియంట్ కూడా వస్తుందని భావిస్తున్నారు. ఎం3 ప్రొ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్తో వస్తున్నది. ఈ ఫోన్లో అధిక రిఫ్రెష్ రేట్, 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ, వేగవంతమైన స్టోరేజ్ మాడ్యూల్ను కూడా అందిస్తోంది. పొకో ఎం3 ప్రొ ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 12తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లో 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండనుంది.