కిన్షాస: కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు. మరో వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో దవాఖానలో చేరాడని అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి ప్రవహించిన లావా ఇళ్లను ముంచెత్తింది. దీంతో తొమ్మిది మంది దహనమయ్యారు. అదేవిధంగా గోమా జైలు నుంచి ఖైదీలను తరలిస్తుండగా ట్రక్కు బోల్తా పడి 14మంది దుర్మరణం చెందారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.