కిన్షాసా : కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల విస్పోటనం చెందింది. శనివారం రాత్రి ఒక్కసారిగా అగ్నిపర్వం బద్దలవడంతో చిమ్ముతున్న లావాతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. అగ్నిపర్వతం చివరిసారిగా 2002లో విస్పోటనం చెందగా.. వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.
సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు యూరప్ నుంచి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ టిసెకెడి పేర్కొన్నారు. ఇప్పటికు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. లావా గోమా వైపుకంటే రువాండా వైపు వెళ్తోందని అగ్నిపర్వతాల శాస్త్రవేత్త చార్లెస్ పేర్కొన్నారు. విస్పోటనం చెందిన అగ్రిపర్వదానికి దగ్గరలో విరుంగా నేషనల్ పార్క్ దగ్గరగా ఉంది. ప్రపంచంలోని పర్వత గొరిల్లాలకు నిలయం. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది.