హైదరాబాద్ : దక్షణ తీర రాష్ట్రాలకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. యాస్ తుఫాన్ క్రమంగా బలపడుతుండటంతో పలు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శనివారం తెలిపింది. యాస్ తుఫాన్ ఈ నెల 26 వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీనికి తోడు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని వెంటే ఉత్తర అండమాన్ తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో దక్షిణ తీర రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తౌక్టే తుఫాన్ కారణంగా పశ్చిమ తీర రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.