న్యూఢిల్లీ: తమ జట్టుతో భారత్ ఆడే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను నిర్వహించేందుకు వీలుగా ఐదు టెస్టుల సిరీస్ను వారం ముందుగానే ముగించాలని బీసీసీఐ అడిగిందని వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని ఈసీబీ శుక్రవారం స్పష్టం చేసింది. కరోనా వల్ల పర్యటనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం, ఏర్పాట్లపై మాత్రమే మాట్లాడినట్టు చెప్పింది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమ్ఇండియా జూన్ మొదటివారంలో బ్రిటన్ బయలుదేరనుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం చివరి టెస్టు సెప్టెంబర్ 14న ముగియాల్సి ఉండగా.. ఈ ఏడాది ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్లను కూడా అదే నెలలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నది.