న్యూఢిల్లీ, మే 18: కరోనా కట్టడికి టీకాలు సంజీవనిలా పనిచేస్తున్నట్టు మరోసారి రుజువైంది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న తర్వాత కొవిడ్ సోకిన వారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉన్నట్టు గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 18.51 కోట్ల డోసులు వేయగా.. ఇందులో 1,43,112 మంది (0.07 శాతం) మాత్రమే కొవిడ్బారిన పడ్డారు. కరోనా కట్టడిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే, కొవాగ్జిన్ టీకా రెండు డోసులు వేసుకున్న వారిలో 0.13 శాతం మందికి, కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్న వారిలో 0.07 శాతం మందికి మాత్రమే కరోనా సోకినట్టు వెల్లడైంది. కాగా, టీకా వేసుకున్న వారికి కరోనా సోకే అవకాశాలు 20 శాతం కంటే తక్కువేనని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే, టీకా వేసుకున్న వారి నుంచి వైరస్ వ్యాప్తి కూడా చాలా తక్కువగా జరుగుతున్నదని, ఈ విధంగా మహమ్మారి కట్టడికి టీకా గొప్ప ఆయుధమని అంతర్జాతీయ వైద్య నిపుణులు, మెడికల్ జర్నల్స్ చెబుతున్న విషయం తెలిసిందే.
టీకా పేరు: కొవిషీల్డ్
టీకా పేరు: కొవాగ్జిన్