భువనేశ్వర్ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను జూన్ 1 ఉదయం 5 గంటల వరకూ పొడిగిస్తూ ఒడిషా ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో వైరస్ నియంత్రణకు మే 5 నుంచి ఒడిషా రెండు వారాల లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నియంత్రణలు ముగుస్తున్న క్రమంలో లాక్డౌన్ ను పొడగించినట్టు ఒడిషా ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు తాజా ఉత్తర్వుల ప్రకారం నిత్యావసరాలను విక్రయించే షాపులను ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతించింది. కాగా పెండ్లి వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను 50 నుంచి 25 మందికి కుదించింది. ఇక వారాంతపు షట్ డౌన్ యథావిథిగా కొనసాగుతుందని ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర స్పష్టం చేశారు. నియంత్రణలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.