బడంగ్పేట,మే13: లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి…9వ డివిజన్లోని నందిహిల్స్ కాలనీకి చెందిన కె. విజయలక్ష్మికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును గురువారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి పార్టీలకు అతీతంగా అందజేశామని పేర్కొన్నారు.