థియేటర్లలోనే కాదు.. నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా పైరసీ బెడద తప్పడం లేదు. సల్మాన్ ఖాన్ రాధే సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీకి గురైంది. మధ్యాహ్నం సినిమా విడుదలైందో లేదో సాయంత్రానికే సినిమా పైరసీ లింక్స్ నెట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఎవరికి వాళ్లు డౌన్లోడ్ చేసుకుని సినిమా చూసేస్తున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతిసారి రంజాన్ పండుగకు ఒక సినిమాను విడుదల చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. వాటికి రికార్డు వసూళ్లు కూడా వస్తుంటాయి. అలాగే ఈసారి ఈద్కు రాధే సినిమాతో వచ్చాడు సల్మాన్ ఖాన్. మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేద్దామని అనుకున్నా కరోనా కారణంగా కుదర్లేదు. దీంతో కేవలం ఓటీటీలోనే సినిమాను విడుదల చేశారు. జీ 5 యాప్ ద్వారా పే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను గురువారం ( మే 13న ) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పే ఫర్ వ్యూ కింద ఈ సినిమా చూడాలంటే ధర రూ.249గా నిర్ణయించారు. కాంబో ప్యాక్ అంటూ 499 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా అలా విడుదలైందో లేదో ఈ సినిమాను కొంతమంది పైరసీ చేసి పలు సైట్లలో పెట్టేశారు. దీంతో జీ స్టూడియోస్కు భారీగానే నష్టం జరిగేలా కనిపిస్తుంది. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా ఈ పైరసీ తప్పకపోవడంపై దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పైరసీని ఎలా అడ్డుకుంటారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
సల్మాన్ దెబ్బకు జీ5 యాప్ ఢమాల్..!
తమిళియన్ను పెండ్లి చేసుకుంటా: రష్మిక
అనుష్క నయా లుక్ నెట్టింట్లో చక్కర్లు..!
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
బాలీవుడ్ ఆఫర్కు నో చెప్పిన సాయి పల్లవి
రాజశేఖర్తో గోపీచంద్ మల్టీస్టారర్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్