ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రానున్న రోజులలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు భయపడిపోతున్నారు. కొందరు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి క్రమంలో రాశీ ఖన్నా తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి షేర్ చేసింది. ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మనం పోతే ఆ బాధ మనకు తెలియదు.. వేరే వాళ్లకు తెలుస్తుంది.. స్టుపిడ్స్కు అలానే జరుగుతుంది.. దయచేసి మాస్కులు ధరించండి అని రాశీ ఖన్నా కోరారు. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ మారుతి కాంబోలో వస్తోన్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మరోవైపు తమిళంలోను పలు సినిమాలతో బిజీగా ఉంది.