వ్యాక్సినేషన్ తప్పనిసరి
క్షేత్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో రామారావు
శ్రీశైలం, మే 11: శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు దేవస్థాన సిబ్బందికి, స్థానిక ప్రజలందరికీ వైద్యం ఒకేలా అందించాలని ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం ఉదయం క్షేత్ర పరిధిలోని పలు విభాగాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున సదన్లో రెండో విడుత వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని కొవిడ్బారి నుంచి తమనుతాము రక్షించుకోవాలని సూచించారు. డాక్టర్ సోమశేఖర్, ఆలయ భద్రతా పర్యవేక్షకుడు శ్రీహరి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. అనంతరం దేవస్థాన దవాఖానలో యాత్రికులు, స్థానికులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు అవసరమైన సదుపాయాలతోపాటు ఓపీ పేషెంట్ల కోసం కావాల్సిన మందులను సమకూర్చుకోవాలని అపోలో వైద్యుడు మహేశ్కు సూచించారు. అదేవిధంగా గోశాలలో ఆవుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎండలకు తట్టుకునేలా తాటిఆకుల చలువపందిళ్లు మరిన్ని వేయాలని అన్నారు. ఈవో వెంట ఏఈవోలు కృష్టారెడ్డి, డీ మల్లయ్య, పర్యవేక్షకులు మధుసూదన్రెడ్డి, స్వాములు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్కుమార్ ఉన్నారు.