కొనసాగుతున్న ఆరోగ్య వివరాల సేకరణ
పెద్దపల్లిలో 284 మందికి ఫీవర్ లక్షణాలు
పెద్దపల్లి జంక్షన్, మే 11: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఇంటింటా జ్వర సర్వే జిల్లాలో కొనసాగుతున్నది. వైద్య, అంగన్వాడీ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బం ది టీమ్లుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. అలాగే కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కరోనా వచ్చిన వారు తప్పని సరిగా ముందుస్తుగా హోం ఐసొలేషన్ ఉంటూ, వైద్య సలహాలను పాటిస్తూ మందులు వాడాలని సూచిస్తున్నారు. పరిస్థితి సీరియస్గా ఉంటే దవాఖానలకు వెళ్లాలని చెబుతున్నారు. పెద్దపల్లి పట్టణంలో ఈ నెల 6వ తేదీ నుంచి జ్వర సర్వే సాగుతున్నది. పట్ణణంలో 9,700 గృహలు, 50వేల పైగా జనాభా, 36 వార్డులుండగా, 36 జ్వర సర్వే టీమ్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. వైద్య, అంగన్వాడీ సిబ్బందితో పాటు మున్సిపల్, మెప్మా సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన జ్వర సర్వేలో 5,822 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 30 మందికి జ్వర లక్షణాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి దాకా 28,289 మంది ఆరోగ్య వివరాలు సేకరించగా, 284 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని కమిషనర్ తిరుపతి తెలిపారు.
కోల్సిటీ, మే 11: రామగుండం 13వ డివిజన్ విఠల్నగర్లో ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేటర్ రాకం లత దామోదర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలతో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకున్నారు. సాధారణ జ్వర లక్షణాలు ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పలు సలహాలు, సూచనలు చేశారు. జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు ఉంటే ఇంటికి వచ్చే సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తీవ్రత అధికంగా ఉన్నందున స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు కనకలక్ష్మి, రజిత, ఆర్పీ స్వప్న, అంగన్వాడీ ఆయాలు జగదీశ్వరి, చంద్రగిరి లక్ష్మి, స్థానికులు బెల్క రవి, రొంటాల రవి, గాజుల రమేశ్ ఉన్నారు.