ఒక్కరోజే 7,754 మంది డిశ్చార్జి
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం కొత్తగా 4,826 మందికి పాజిటివ్గా తేలింది. 7,754 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 86.94 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 82.3 శాతంగా నమోదైంది. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 32 మంది మరణించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 723, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 324, రంగారెడ్డిలో 302, నల్లగొండలో 295, వరంగల్ అర్బన్లో 242, నాగర్కర్నూల్లో 208, కరీంనగర్లో 207, ఖమ్మంలో 205 కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 62,797 ఉన్నది.