కుత్బుల్లాపూర్, మే 9: ఓఎల్ఎక్స్లో వస్తువు అమ్మకానికి పెట్టిన ఓ మహిళను బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. క్యూర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి.. ఖాతా ఖాళీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొంపల్లికి చెందిన రేణుక (38) అల్మారను రూ.6 వేలకు విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ఫొటోలు ఆప్లోడ్ చేశారు. ఈ ప్రకటనను చూసిన రాకేశ్శర్మ అనే వ్యక్తి తనకు అల్మార కావాలంటూ.. డబ్బులు పేటీఎం ద్వారా చెల్లిస్తానన్నాడు. అతడు సూచించిన విధంగా క్యూ ఆర్కోడ్ స్కాన్ చేయగానే సదరు మహిళ ఖాతా నుంచి రూ.52 వేలు మాయమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటో, పేరుతో ఫేస్బుక్ ఐడీని స్పష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ.. దూలపల్లికి చెందిన కృష్ణ (45) ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.