హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పగటి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సదుపాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గమ్యస్థానాలు చేరుకునే దూరప్రాంత బస్సు సర్వీసులను రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..