గండీడ్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజుగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నదని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గండీడ్ మండల కేంద్రంతోపాటు మహ్మదాబాద్, నంచర్ల, బల్సర్కొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.1888 రైతులకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గిరిధర్రెడ్డి, ఎంపీటీసీ బాలయ్య, సర్పంచులు వెంకట్రాంరెడ్డి, అనసూయ, వనజ, చంద్రకళ, డైరెక్టర్లు సత్యనారాయణరెడ్డి, వెంకటయ్య, మాజీ పీఏసీసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, రాంచంద్రయ్య, తిర్మల్రెడ్డి, రమేశ్రెడ్డి, భగవంత్గౌడ్, శ్రీధర్, నరేందర్గౌడ్, సీఈవో ఆశన్న, పీఏసీసీఎస్ సిబ్బంది ఖాజా, గోపాల్, చెన్నయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.