హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసినవాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని శుక్రవారం ట్వీట్ చేశారు. మంత్రి కే తారకరామారావు, ఎంపీ సంతోష్కుమార్లు కరోనా నుంచి కోలుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆకాక్షించారు. నిత్యం ప్రజాసంక్షేమం కోసం పరితపించే మంత్రి కేటీఆర్ వైరస్ నుంచి త్వరగా బయటపడాలని భగవంతుడిని వేడుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ కరోనాను జయించి త్వరగా కోలుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్చేశారు.
అల్లా దయతో వారు త్వరగా కోలుకోవాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలతో వారు త్వరగా కోలుకోవాలని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు గడ్దం రంజిత్రెడ్డి, బండా ప్రకాశ్ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వారు త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శంకర్మఠంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిశోర్గౌడ్, వెంకటేశ్వర్రెడ్డి పూజలు నిర్వహించారు.
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి అల్లోల
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 23: ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.