ఎలిగేడు, ఏప్రిల్ 21: మండల వైద్యాధికారి నిస్సీక్రిస్టినా ఆధ్వర్యంలో మండలంలో రెండు బృందాలతో కొవిడ్ టీకా వేయిస్తున్నారు. బుధవారం ఒక బృందంతో పీహెచ్సీలో, మరొక బృందంతో శివపల్లిలో టీకా వేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ దుగ్యాల శ్వేత భర్త సంతోష్రావు, ఉప సర్పంచ్ వంగ అజయ్, హెల్త్ సూపర్వైజర్ గంగమరాజు, ఆశ వర్కర్లు, సిబ్బంది ఉన్నారు.
ధర్మారం, ఏప్రిల్ 21: నంది మేడారంలోని పీహెచ్సీలో బుధవారం 125 మందికి టీకాలు వేసినట్లు వైద్యుడు సంపత్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, జీపీ కార్యదర్శి లక్ష్మణ్బాబు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇక్కడ మూడు రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్నది. 104 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా, 20 మందికి హోం క్వారంటైన్ ముగిసిందని, ఇంకా 84 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు పీహెచ్సీ వైద్యుడు వెల్లడించారు. ఈ నెల 22న దొంగతుర్తిలో, 23న పత్తిపాకలో, 24న కమ్మర్ఖాన్పేటలో, 25న కొత్తూరులో, 26న ధర్మారంలో టీకాలు వేస్తామని వివరించారు. మల్లాపూర్, లంబాడీతండా గ్రామాల్లోనూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 21: రాఘవాపూర్, రాగినేడు పీహెచ్సీల పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. రాఘవాపూర్లో 85 మందికి టీకాలు వేశారు. 25మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ మమత తెలిపారు. రాగినేడు పీహెచ్సీ పరిధిలో 52 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిదిమందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ ఫణీంద్ర పేర్కొన్నారు.
జ్యోతినగర్, ఏప్రిల్ 21: విలేజ్ రామగుండం యూపీహెచ్సీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో వ్యాక్సినేషన్ కొనసాగింది. అన్నపూర్ణకాలనీలో 70మంది టీకాలు వేసుకున్నారు. విలేజ్ రామగుండం యూపీహెచ్సీలో 33మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ మణికేశ్వర్రెడ్డి, సూపర్వైజర్లు సమ్మయ్య, తిరుపతిరెడ్డి, సిబ్బంది సుగుణ, భాగ్యలక్ష్మి తదితరులున్నారు.
ఫర్టిలైజర్సిటీ, ఏప్రిల్ 21: పారిశ్రామిక ప్రాంతంలోని దవాఖాన్లలో పరీక్షలు నిర్వహించగా 129 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
నేటి నుంచి వ్యాక్సినేషన్ శిబిరాలు
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 21: ఈ నెల 22వ తేదీన ఆరెపల్లె, 23న గంగారం, 24న మీర్జంపేట, 25న మొట్లపల్లి, 26న మల్యాలలో కరోనా వ్యాక్సినేషన్ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కిషన్ తెలిపారు. అర్హులు టీకా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలో బుధవారం 89మందికి పరీక్షలు చేయగా ఎనిమిదిమందికి పాజిటివ్ వచ్చినట్ల్లు డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
రామగిరి, ఏప్రిల్ 21: మండలంలోని బుధవారంపే ట, రత్నాపూర్ గ్రామాల్లో గురువారం, బేగంపేటలో శుక్రవారం వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు మండల వైద్యాధికారి నాగశిరోమణి తెలిపారు. అర్హులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 21: రాగినేడు పీహెచ్సీ పరిధిలో గురువారం తుర్కలమద్దికుంటలో, 23న నిట్టూరులో, 24న చందపల్లిలో, 25న అందుగులపల్లిలో, 26న పాలితంలో కొవిడ్ టీకాలు వేయనున్నట్లు డాక్టర్ ఫణీంద్ర తెలిపారు. రాఘవాపూర్ పీహెచ్సీ పరిధిలో గురువారం శాంతినగర్, పెద్దకల్వల, 23న పెద్దకల్వల, బండారికుంట, 24న మూలసాల, పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్కాలనీ, 25న రంగంపల్లి, 26న సబ్బితం గ్రామాల్లో టీకాలు వేయనున్నట్లు డాక్టర్ మమత పేర్కొన్నారు. పీహెచ్సీల్లోనూ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు.