అయిజ, ఏప్రిల్ 20 : మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 18, 4 వవార్డుల్లో నిర్మించతలపెట్టిన ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు మున్సిపల్ చైర్మన్ శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానంగానే ఉప కేంద్రాలు పని చేస్తాయన్నారు. మున్సిపాలిటీకి నాలుగు ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో భవనం రూ. 16లక్షలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పీహెచ్సీ డాక్టర్ రామలింగారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, మండల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ రామలింగారెడ్డి, కమిషనర్ వేణుగోపాల్, కౌన్సిలర్లు నర్సింహులు, నాగమ్మ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.