మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం కాంపల్లి గ్రామ శివారులో గల పలుగు బోడు తండాకు చెందిన కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు..మిర్చి తోట ఏరడానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాళ్ల సంకీస గ్రామ శివారులోని భూక్యా తండా వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బానోతు బాజి (54), మౌగలి (40), ఉమా (29), జర్పుల బుజ్జి (35) లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పటల్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం