జానారెడ్డిని ప్రశ్నించిన పల్లా రాజేశ్వర్రెడ్డి
జానారెడ్డి 11 శాఖల మంత్రిగా వ్యవహరించినా హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎందుకు తేలేకపోయారో చెప్పాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. హాలియాను ఎందుకు మున్సిపాలిటీగా చేయలేకపోయారని ప్రశ్నించారు. సాగర్ ప్రాజెక్టు తలాపున ఉన్నా 70 వేల ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. 2018 నుంచి ఇప్పటి వరకు రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు చేయించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని చెప్పారు. ఉప ఎన్నికల్లో నోముల భగత్ను గెలిపించి హాలియా పట్టణాభివృద్ధికి బాటలు వేయాలని పల్లా కోరారు.