బెంగళూరు : కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. బెంగళూరులో నెల రోజుల్లోన 500 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఒక్క మార్చి నెలలోనే పదేళ్ల లోపు ఉన్న 50 మంది చిన్నారులకు ఈ వైరస్ వ్యాపించింది. మొత్తంగా 500 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 32 వేల మంది స్కూల్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 121 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
కర్ణాటకలో ఇప్పటి వరకు 9,97,004 మంది కరోనా బారిన పడ్డారు. మృతుల సంఖ్య 12,567కు చేరింది. 9,56,170 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 28,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 4,225 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించారు. 1,492 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇవీ కూడా చదవండి..