ఏప్రిల్ 1 నుంచి ఇరవై సెంటర్లలో కరోనా టీకాలు
ప్రతి రోజూ 1,150 మందికి ఇచ్చేందుకు ప్లాన్
6 నుంచి 8 వారాల వ్యవధిలో రెండో డోస్
స్పాట్ రిజిస్ట్రేషన్కు అవకాశం : డీఎంహెచ్వో మధుసూదన్
జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది ఉన్నట్లు అంచనా
వరంగల్రూరల్, (నమస్తేతెలంగాణ):కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాపకింద నీరు లా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను మరింత అప్రమత్తం చేసింది. దీంతో ఆ శాఖ అధికారులు కరోనా వైరస్ టెస్టు ల సంఖ్యను పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్ల వయసు పైబడిన వారందరి కీ కరోనా టీకాలు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కమ్యూనిటీ హె ల్త్ సెంటర్లు(సీహెచ్సీ), ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో(పీహెచ్సీ) వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రతి సీహెచ్సీలో 100, పీహెచ్సీలో 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉన్న జనాభాలో 45 ఏండ్లు పైబడిన వారు 21 శాతం మంది ఉంటారని ఒక అంచనాకు వచ్చారు. ఈ లెక్కన జిల్లా లో 7.40 లక్షల జనాభా ఉండగా, వీరిలో 45 ఏండ్లు పైబడిన వారు 1.55 లక్షల మందికిపైగా ఉంటారని భావిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 1,150 మందికి క రోనా టీకాలను పంపిణీ చే సేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రెడీ అవుతున్నారు. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో సీహెచ్సీలు ఉన్నాయి. పదహారు మండలాల్లో పదిహేడు పీహెచ్సీలు ఉన్నా యి. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతిరోజూ ఒ క్కో సీహెచ్సీలో 100 మందికి, పీహెచ్సీలో 50 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ వెల్లడించారు. 45 ఏం డ్లు పైబడిన వారు కరోనా టీకా తీసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని లేదా నేరుగా సీహెచ్సీ, పీహెచ్సీకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. కోవాగ్జిన్ టీకాల్లో ఏదైతే తీసుకుంటారో 6 నుంచి 8 వా రాల మధ్య తిరిగి రెండో డోస్ అదే వ్యాక్సిన్ తీసుకోవాలని డీఎంహెచ్వో స్పష్టం చేశారు. 45 ఏండ్లు నిండిన వారికి కరోనా టీకా ఇవ్వడంపై గురువారం హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శుక్రవారం డీఎంహెచ్వో మధుసూదన్ జిల్లాలోని తమ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమై ఏప్రిల్ ఒకటి నుంచి టీకా పంపిణీ కోసం జిల్లాలోని ఇరవై సీహెచ్సీ, పీహెచ్సీల్లో అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు.
కరోనా పరీక్షలు విస్తృతం..
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరోనా టెస్టు లను మరింత విస్తృతం చేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 1,150 టెస్టులు చేస్తున్నట్లు డీఎంహెచ్వో మధుసూదన్ తెలిపారు. ప్రతి సీహెచ్సీలో 100 టెస్టులు చేస్తే వీటిలో యాభై ఆర్టీపీసీఆర్, మరో యాభై ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు ఉంటున్నట్లు తెలిపారు. ఇలా జిల్లాలోని మూడు సీహెచ్సీల్లో ప్రతిరోజు 150 ఆర్టీపీసీఆర్, 150 ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పీహెచ్సీలో రోజూ 50 ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు జరుగుతున్నాయని, ఈ లెక్కన జిల్లాలోని 17 పీహెచ్సీల పరిధిలో 850 ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేస్తున్నామన్నారు. పీహెచ్సీ పరిధిలో జరిగే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులను పీహెచ్సీలోనే గాకుండా సబ్ సెంటర్లలో కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో సబ్ సెంటర్లకు రాలేని స్థితిలో ఉండి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహిస్తున్నారు.