పట్టుబడిన పాలమూరు మత్స్యశాఖాధికారి గంగారాం
రూ.45 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా..
మహబూబ్నగర్, మార్చి 24 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : నాగర్కర్నూల్ జిల్లా బ ల్మూర్లో రైతుల నుంచి లంచం తీసుకుంటూ ముగ్గురు వీఆర్వోలు ఏసీబీకి పట్టుబడిన ఘ టన మరువకముందే పాలమూరులో మరో అ ధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మహబూబ్నగర్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పి.గంగారాం ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లం చం తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. 19 మంది కొత్త సభ్యులను కొ త్తగా ఏర్పాటు చేస్తున్న మత్స్య సహకార సొసైటీలో చేర్చేందుకుగానూ బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు శివకుమార్తో గంగారాం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రతి సభ్యుడి నుంచి రూ.4వేల చొప్పున దాదాపు రూ.76 వేలు డిమాండ్ చేయగా.. రూ.45 వేలు ఇస్తానని శివకుమార్ చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం మహబూబ్నగర్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో గంగారాంకు శివ డబ్బులు ఇ స్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీ ఐలు పి.లింగస్వామి, పి.రఘుబాబు, మరో పది మంది సి బ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ఫి ర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.