న్యూఢిల్లీ, మార్చి 23: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని ఒక ప్రకటనలలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనాలు రూ.2,500 వరకు అధికమవనున్నాయి.
నిస్సాన్ కార్లు కూడా: నిస్సాన్ ఆటోమొబైల్ కంపెనీ కూడా తన వాహన ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడంతో వచ్చే నెల నుంచి అన్ని రకాల మోడళ్ళ ధరలను సవరిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏప్రిల్ 1 నుంచి నిస్సాన్, డాట్సన్ బ్రాండ్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం కంపెనీ వెల్లడించలేదు.