ముంబై, మార్చి 20: ముకేశ్ అంబానీ కేసులో ఇటీవల క్రమశిక్షణ చర్యల కింద ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి బదిలీ అయిన పరంబీర్సింగ్ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలోని బార్లు, హోటళ్ల నుంచి ప్రతి నెలా కనీసం రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని పోలీసు అధికార్లను మంత్రి ఆదేశించేవారని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు 8 పేజీల లేఖను పరంబీర్ రాశారు. పోలీసు అధికారులను హోంమంత్రి దేశ్ముఖ్ తన అధికార నివాసానికి పిలిపించుకుని, వారికి నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి వసూళ్లకు ‘టార్గెట్లు’ ఇచ్చేవారని ఆ లేఖలో పరంబీర్ ఆరోపించారు. పరంబీర్ ఆరోపణలపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు దేశ్ముఖ్ తెలిపారు.