ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ప్రయాణమవుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నాగపూర్తోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే రాష్ట్రమంతటా లాక్డౌన్ విధిస్తామని, ఆ పరిస్థితిని రానివ్వవద్దని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ప్రజలను హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు పొరుగున్న ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు మరోసారి తమ సొంతూర్ల బాటపడుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన కొందరు వలస కార్మికులు శనివారం నాగపూర్ నుంచి బస్సుల్లో బయలుదేరారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మధ్య బస్సులు నిలిపివేస్తారన్న ప్రచారం జరుగుతున్నదని అందుకే తమ రాష్ట్రానికి వెళ్లిపోతున్నట్లు వలస కార్మికులు తెలిపారు.