ముంబై: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే, ఆయన సతీమణి సీమా అథవాలే ఇవాళ కొవిడ్ టీకా తొలి డోస్లు తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ వైద్యసిబ్బంది వారికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాందాస్ అథవాలే.. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి టీకాలు వేయించుకోవాలని సూచించారు. కాగా, దేశంలో గత జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ సిబ్బంది, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, 45 ఏండ్లకు పైబడిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు ఇస్తున్నారు.