బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు అయిన ఎన్ఎస్ లక్ష్మీనారాయణ భట్ట (84) ఇకలేరు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. కన్నడ సాహిత్యం రంగంలో NSLగా పేరుగాంచిన ఆయన 1936లో శివమొగ్గ జిల్లాలో జన్మించారు. సాహిత్య రంగంలో లక్ష్మీనారాయణ భట్ట చేసిన కృషికిగాను కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, కన్నడ రాజ్యోత్సవ అవార్డు లభించాయి.
కాగా, లక్ష్మీనారాయణ భట్ట మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్ష్మీనారాయణ భట్ట మృతి కన్నడ సాహిత్యరంగానికి తీరనిలోటు అని పేర్కొన్నారు.