రోహతక్ : హర్యానాలోని రోహతక్లో ఘోరం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి రెజ్లింగ్ సెంటర్పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళా రెజర్లు, కోచ్, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులను ప్రదీప్ మాలిక్, పూజ, సాక్షిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.