వనపర్తి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రైతు ను రాజును చేయడమే లక్ష్యంగా పండ్ల తోటలు, పందిరి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తున్నది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భాగంగా పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఉ ల్లి నిల్వల నిర్మాణాలు, సూక్ష్మనీటి సేద్యాన్ని ప్రో త్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి జిల్లాకు లక్ష్యాలను నిర్దేశించింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో పంట విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానవన శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం రాయితీలు అందిస్తూనే స్ప్రింకర్లు, డ్రిప్లపై సబ్సి డీ ఇస్తున్నది. ఆధునిక సాగువైపు రైతుల దృష్టి మ ళ్లించి అధిక దిగుబడి వచ్చేలా కృషి చేస్తున్నారు. పండ్లతోటలు సాగు చేసిన మొదటి మూడేండ్లకు ఉద్యానవనశాఖ రాయితీలు అందిస్తున్నది. ఈ ఏ డాదిలో 20 ఎకరాల్లో మామిడి తోటలు, 50 ఎకరాల్లో జామ, 20 ఎకరాల్లో అరటి, 30 ఎకరాల్లో బొప్పాయి పెట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్, అంజీర, నేరేడు, ఉసిరి, చింతపండు తోటలకు ఒక్కో రకానికి ఐదెకరాల వరకు రాయితీ ఇస్తున్నారు. 15 ఏండ్లు పైబడిన మామిడి తోటల పునరుద్ధరణకు ఎకరాకు రూ.8 వేలు రాయితీ అందిస్తున్నారు. ఈ ఏడాది వనపర్తి జిల్లాకు 25 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. ఒ క్కో పంట లేదా తోటకు విభాగాల వారీగా 40 నుంచి 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
కూరగాయల సాగుకు ప్రత్యేకం..
కూరగాయల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు ప్రకటించింది. టమాట, వంకాయ, మి రపనారుకు సంబంధించి ఎకరాకు రూ.1,500 అందిస్తున్నది. మిరుపకు ఎకరాకు రూ.1280 డీడీ ముందుగానే తీయాలి. మల్చింగ్ విభాగంలో జిల్లాకు 105 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించగా.. ఎకరానికి రూ.6,400 రాయితీ కల్పిస్తున్నారు. కూరగాయల పందిళ్లకు ఒక్కో యూనిట్కు రూ. లక్ష వరకు సబ్సిడీ అందిస్తున్నారు.
సబ్సిడీ యంత్రాలతో ప్రోత్సాహం..
ఉద్యానవన పంటలను ప్రోత్సహించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ప్రోగ్రాం కింద పలు రాయితీలు అందజేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన మూడు మినీ ట్రాక్టర్లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసింది. అదేవిధంగా 940 హెక్టార్ల కోసం 675 సబ్సిడీ డ్రిప్లు, 265 సబ్సిడీ స్ప్రింక్లర్లు కేటాయించింది.
ఉద్యానవన పంటలపై అవగాహన..
రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్ర భుత్వం ఇచ్చే రాయితీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తున్నాం. కూరగాయల సాగుతో అధిక ఆదాయం పొందొచ్చు. రాయితీపై నారు అందించడంతోపాటు పనిముట్లు, యంత్రాలను స బ్సిడీపై ఇస్తున్నాం. మినీ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు స్ప్రింకర్లు, డ్రిప్లు అందిస్తున్నది.