అమరచింత: మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఎమ్మెల్సీలు సందర్శించారు. జోగులంబ గద్వాల్ జిల్లాలో జరుగుతున్న కేటీఆర్ పర్యట నలో పాల్గొనేందుకు వెళ్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు కుచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలకు మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా వారు జూరాల ప్రాజెక్టు కింద సాగు అవుతున్న భూముల వివరాలను స్థాని క టీఆర్ఎస్ నాయకులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జూరాల ప్రాజెక్టును సందర్శించి ప్రకృతి అందాలను తిలకించారు. వారితో పాటు వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, జడ్పీటీసీ మార్క సరోజ, సర్పంచ్ బండి పావనివెంకట్రెడ్డి, మున్సిపాలిటి కోఆప్షన్ మెంబర్ షాన్వాజ్ ఖాన్, షాహిన్, రఫీ, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.