ఆత్మకూరు, సెప్టెంబర్ 27: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమవారం ఉదయం నుంచి వరద పెరిగింది. సాయంత్రం 5గేట్లెత్తి స్పిల్వే ద్వార 34,900 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 945 క్యూసెక్కులు, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 850, భీమా -1కు 650, భీమా-2కు 750, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 32,775 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతుంది. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 3.955 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 213.241 మి.యూ. ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 4.86 మి.యూ. ఉత్పత్తి జరుగగా మొత్తంగా 236.875 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం 8.611 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి 92,628 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది.
కోయిల్సాగర్కు స్వల్పంగా..
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 27: కోయిల్సాగర్కు ఎగువ నుంచి మోస్తరుగా వరద నీరు చేరుతున్నది. సోమవారం ఒక గేటు నుంచి 300క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు. ప్రాజెక్టులో 32.5 అడుగుల(2.25 టీఎంసీలు) నీరు ఉందని, వరద ప్రభావాన్ని పరిశీలిస్తూ నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు.
తుంగభద్రకు..
అయిజ, సెప్టెంబర్ 27: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. సోమవారం ఇన్ఫ్లో 10,871, అవుట్ఫ్లో 10,474 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1633 అడుగులు, నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1632.84 అడుగుల వద్ద 100.239 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 12,233 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 11,800 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నాయి. ప్రస్తుతం ఆనకట్టలో 9.2 అడుగుల మేర నీటి మట్టం ఉండగా, ప్రధానకాల్వకు 433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి నిలకడగా..
శ్రీశైలం, సెప్టెంబర్27: కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. సోమవారం జూరాల ప్రాజెక్టు నుంచి 34,755 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి నుంచి 33,925 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 26,472 క్యూసెక్కులు మొత్తం 95,152 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయ్రంతం 6గంటల వరకు రిజర్వాయర్కు 62,892 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా నమోదైంది. ఏపీ పవర్ హౌస్కు 14,680 క్యూసెక్కులు, టీఎస్ పవర్హౌస్కు 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగుల వద్దకు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘చిట్టెం’ రిజర్వాయర్కు జలకళ
మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ జలకళ సంతరించుకున్నది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో సోమవారం రిజర్వాయర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఈ క్రమంలో ఒక గేటు తెరిచి 500 క్యూసెక్కులను దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు ఏఈ నాగశివ తెలిపారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 3.317 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పెద్దవాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ సూచించారు.