గోపాల్పేట, జూలై 12 : చదువు వి జ్ఞానం కోసమేనని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని.. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నాసనల్లి రాములు చిన్న కొడుకు కొండల్ 8న ఆత్మహత్య చేసుకోగా సో మవారం మంత్రి నిరంజన్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాములు-వెంకటమ్మ దంపతులకు స్వ యంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ కొండల్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. చేతికొచ్చిన పిల్లలు బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుశోకం పెట్టోదన్నారు. తెలంగాలో ప్రజలకు ఉ పాధి అవకాశాలు పెంచామన్నారు.
ఏ డేండ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇ చ్చామని, మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. 50 వేల ఉద్యోగాలకు 5 లక్షల మంది పోటీ పడొచ్చు, మరి మిగిలిన 4.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచిస్తే సమస్య పరిష్కారం అ వుతుందా.. అని ప్రశ్నించారు. ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దని సూచించారు. సాగునీటి రాకతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, పంటల దిగుబడుల తో రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నారన్నారు. ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు సాగు నీరు తీ సుకొచ్చామన్నారు. నిరుద్యోగులను తోటి స్నేహితులు.. నీకేంటి మీ అమ్మానాన్న సంపాదిస్తారు.. నీవు తిని తిరుగుతావని హేళనగా మాట్లాడొద్దని, మా అ న్న చావే అఖరిది కావాలని కొండల్ సోదరి కవిత కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. మంత్రి వెంట వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జెడ్పీటీసీ మంద భార్గవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, డైరెక్టర్ పరశురాం, మాజీ సర్పంచ్ పేరి లోకారెడ్డి, ఎంపీటీసీ కృష్ణయ్య యాదవ్, నాయకులు కొత్తరామారావు, సత్యశీలారెడ్డి, రాము, కోటీశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కోళ్ల వెంటేశ్, శంకరయ్య, రాంచంద్రయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆపన్నహస్తం..
అనారోగ్యం బా రిన పడి మెరుగైన వైద్య సేవలు చేయించుకోవాలనుకునే నిరుపేదలకు ఆపన్నహస్తం సీఎం సహాయనిధి అని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 25 మంది బాధితులకు రూ.6.15 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాయనిధి నుం చి మంజూరైన చెక్కులతో బాధితులు మెరుగైన వైద్య సేవలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌ న్సిలర్లు లక్ష్మీనారాయణ, కంచెరవి, పుట్టపాకుల మహేశ్, పాకనాటి కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.