కొత్తకోట/పెబ్బేరు రూరల్, జూలై 18 : వనపర్తి జిల్లాలో శనివారం రాత్రి భారీ వ ర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల చెరువులు, కుంటలు అలుగు పారాయి. వాగు లు పొంగి పొర్లాయి. కొత్తకోట సింగిల్విం డో కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రికార్డులన్నీ తడిచి ముద్దయ్యాయి. కార్యాలయ ఆవరణలో నీరు నిలిచి బురదమయమైంది. పట్టణ సమీపంలోని శంకర సముద్రం రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తారు. ప్రాజెక్టులో 353 ఫీట్లు నీరు నిల్వ ఉంచాల్సి ఉండగా 352.85 ఫీట్లు చేరడంతో 5 గేట్లకుగానూ రెండు గేట్ల ద్వారా 1500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు ఆ ప్రాజెక్టు జేఈ అఖిల్ తెలిపారు. అలాగే పెబ్బేరు మండలంలోని పలు వాగు లు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. పెబ్బేరు-వనపర్తి ప్రధాన రహదారిపై కంచిరావుపల్లి వద్దనున్న చాపలవాగు ఆదివారం మధ్యాహ్నం పొంగి పారింది. దీంతో రహదారిని నీరంతా ముంచెత్తింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పారుతున్న నీటిలోనే అతి కష్టం మీద వాహనాలను దాటించారు.