వికారాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తితో యాదాద్రి ఆలయానికి అనేక మంది విరాళాలిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిగి నియోజకంవర్గం తరపున కిలో బంగారాన్ని ఆలయానికి విరాళంగా అందజేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రకటించారు.
యాదాద్రికి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ గోపురానికి స్వర్ణం(పసిడి) తాపడం చేయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో అందర్నీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశ్యంతో విరాళాల సేకరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకంవర్గం తరఫున కిలో బంగారం అందచేస్తున్నట్లు కొప్పుల మహేష్ రెడ్డి ప్రకటించారు.